ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ నియోజకవర్గం రిపోర్టర్ నగేష్ జన్మదిన వేడుకలను వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జానారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెపల్లి బాలరాజ్ పాల్గొని విలేఖర్ నాగేష్ ను శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకున్నట్టు తెలిపారు. రిపోర్టర్లకు తమ వంతు సహకారం ఎల్లవేళల అందిస్తానని హామీ ఇచ్చారు. తన కూతురు జ్యురి లియోనా జన్మదినం కూడా ఉండడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా జహీరాబాద్ యూనియన్ ప్రెసిడెంట్ జానారెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఝరాసంగం మండల అధ్యక్షుడు నర్సింలు, జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్, జర్నలిస్ట్ అనిల్ కుమార్, జర్నలిస్టు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.