ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.
నర్సంపేట,నేటిధాత్రి:
పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలోని సోమవారం ఘనంగా నిర్వహించారు.
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ ముస్లిం ప్రజలు జరుపుకున్నారు.మత పెద్ద జామీ మజీద్ ఇమామ్ మహబూబ్ నమాజ్ ను చదివారు. అనంతరం రంజాన్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ మాట్లాడుతూ భారత దేశ ముస్లింలు రంజాన్ మాసంలో లోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆర్బించడం జరిగిందన్నారు. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పాటించి ప్రతిరోజు ప్రత్యేక తరాబి నమాజు పటించి అనంతరం జకాత్ ఫిత్రాలు మరియు హదీయాలు డబ్బు రూపాన పేదలకు అనాధలకు వితంతువులకు దానం చేస్తారన్నారు. ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ ప్రత్యేక నమాజుకై ఈద్గాకు మండల స్థాయి ముస్లిం చదువుతారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికి ఒకరు అలింగనం చేసుకొని కులమతాల అతీతంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లిం ఖబురస్థాన్లోకు వెళ్లి చనిపోయిన బంధువుల సమాధులపై పూలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు జామి మసీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అయుబ్, మీర్జా మసూద్, అలీబేగ్, మహమ్మద్ రబ్బాని, మహమ్మద్ ఆఫీస్,ఇర్ఫాన్ మహమ్మద్, అన్వర్ సయ్యద్ జావేద్ ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.