ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

చందుర్తి, నేటిధాత్రి:
భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే మరాఠా రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ గొప్ప యోధుడు. అలాంటి యోధుడి జన్మధినాన్ని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శివాజీ అభిమానులు, చందుర్తి మండల కేంద్రంలో పాటు జోగాపూర్, కిష్టంపేట గ్రామాలో ఆరె సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి 394 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అన్నారు. ఈ పేరు వింటేనే భారతావని పులకించి పోతుందన్నారు.మొగలులకు ముచ్చెముటలు పట్టించిన యుద్ధ విద్యలో ఆరు తెరిన ధీరుడు అన్యమతస్తులను గౌరవిస్తూ హిందూ మత ధర్మ పరిరక్షణకు పాటుబడి అందరితో చత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠ యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడు అని కొనియాడారు.శివాజీ సేవ సమితి సభ్యులు లక్కార్సూ శశికుమార్,సిరికొండ శ్రీనివాస్,తిప్పని శ్రీనివాస్, పొంచెట్టీ రాకేష్, చిర్రమ్ తిరుపతి, హన్మయచారి,మల్లేశం,వికాస్,వెంకటేష్,తిరుపతి, రాము,వివేక్,రాకేష్,సతీష్,కరుణాకర్,రాజు, నిశంత్,సంపత్,సురేష్, ప్రేమ్,తిరుపతి,మహేందర్,. కానిస్టేబుల్ కాదాస్ రవి,రామ్మోహన్ రావు, మల్లారపు కిషన్ లోకోజి సతీష్, ఎన్నం శ్రీధర్, గొర్రె నందు, దివ్యసాగర్, పాటి సుధాకర్, ఈసరి శ్రీను కొత్త గణేష్, పోంచెట్టి అంజయ్య, తూం గణేష్, గొల్లపల్లి సాయికృష్ణ, దురిశెట్టి రాజు, గొర్రె మోహన్, పీసరి శ్రీను, లింగంపల్లి మధుసూదన్, పత్తిపాక తిరుపతి, ఈర్ల రాజు, ముదాం గంగయ్య,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!