ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలో మాదన్నపేట రోడ్డు ఈద్గా వద్ద నర్సంపేట మండల ముస్లిం సోదరులు ఈద్ ఉల్ అధా బక్రీద్ ప్రత్యేక నమాజును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నమాజ్ ను జామే మజీద్ ఇమామ్ హబీబుర్రహ్మాన్ చదివించారు.హజ్రత్ ఇబ్రహీం అలైహి సలాం దైవ మార్గంలో చేసిన త్యాగానికి పేరుగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటారని పండుగ విశిష్టతను తెలిపారు.నమాజ్ అనంతరం కుల మతాలకు అతీతంగా సోదరా భావంతో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకున్నారు.అనంతరం ముస్లిం కబ్రస్తాన్ కు వెళ్లి చనిపోయిన వారి ఆత్మకు శాంతిచేకూర్చాలని సమాధులపై పూలతో ప్రార్థనలు చేశారు. సాంప్రదాయాన్ని ప్రతిబలతో పలువురు పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ జావిద్, జమ మస్జీద్ అధ్యక్షులు మహమ్మద్ నబీ, కార్యదర్శి హబీబ్, కమిటీ బాధ్యులు మసూద్ అలీ బేగ్, సయ్యద్ జావేద్ అలీ, మహమ్మద్ అయూబ్, మహమ్మద్ హుస్సేన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ డిష్ బావ, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *