నర్సంపేట , నేటిధాత్రి :
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. భారత్ రాష్ట్ర సమితి గ్రామ పార్టీ అధ్యక్షుడు జరుపుల వీరన్న నాయక్ అధ్యక్షతన గ్రామంలోని బస్టాండు కూడలి వద్ద కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులు పెద్ది తిరుపతి రెడ్డి, సుంకరి సంతోష్ రెడ్డి,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి ఐలయ్య,వరంగంటి తిరుపతి రెడ్డి,వాంకుడోతు రాజన్న నాయక్,నాగరాజు,మాజీ సర్పంచ్ అజ్మీర పాపయ్య, ఉప్పుల రాజు, వంగ పురుషోత్తం,బాషబోయిన బక్కులు,భూషబోయిన రాజు,బయ్య నవీన్,రాజు,అజారుద్దీన్,ఎల్లారెడ్డి,సూరయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.