శాయంపేట నేటిధాత్రి
శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం జరిగింది హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామీ దేవాలయ ప్రధాన అర్చకులు పద్మనాభ స్వామి ఆధ్వర్యంలో లోకల బోయిన కుమారస్వామి అనురాధ దంపతులు అయ్యప్ప స్వామి అభిషేకాలు చేసి భజనలతో పడి పూజ జరిగింది.భక్తులు నిర్వహించిన పూజా కార్యక్రమాలను అధిష్టించి స్వామి వారికి పూజలు నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక ఆరాధనను అభినందిస్తూ, భక్తి ప్రధానమైన భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ దివ్యత్వాన్ని ప్రశంసిస్తూ, భక్తుల సంకల్పం, ఆధ్యాత్మిక ఆరాధన భజనలు చేసి పడిని వెలిగించారు ఈ. కార్యక్రమంలో మచ్చ గిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి, ప్రజలు, అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.