
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో గ్రామసభలు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే స్థానిక సంస్థలఎన్నికల లో.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పునాదులు. అని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ప్రవేశపెట్టిన పథకాలే స్థానిక అభ్యర్థులను గెలిపిస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం గాని. రేషన్ కార్డులు గానీ. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీరుణాలు గాని
. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే. ఎక్కువగా అమలు చేస్తారని. తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా. ప్రజలు తమ ఓటు హక్కుతో స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగిల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి.లింగాల గుగ్గిళ్ళ భరత్
. బాలరాజ్ కోల మాజీ సర్పంచ్ బానయ్య.జలంధర్ రెడ్డి. సదానందం. శ్రీరామ్. శ్రీనివాస్. అంజయ్య. రాములు. లావణ్య. ప్రమీల. తంగళ్ళపల్లి మండల. ప్రతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.