గోల్డ్ మెడల్ సాధించిన ఎర్ర శ్రీహన్సి కి గౌడ సంఘం నాయకులు సన్మానం

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీహన్సి తండ్రి లచ్చయ్య , తల్లి చంద్ర కళ (స్తంభంపల్లి ఆశా కార్యకర్త ) నర్మాల లోని T.S.W.R.S. J/C (G) లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది, ఇటీవల జరిగిన రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోని అండర్- 19 విభాగంలో అద్లేటిక్స్ లో 3 కె, 1500 మీటర్లు, 800 మీటర్లు మరియు 400 మీటర్ల పరుగు పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి 4 గోల్డ్ మెడల్ సాదించిన సందర్భంగా.
బుధవారం స్తంభంపల్లి గ్రామం లోని శ్రీ హన్సి ఇంటి వద్ద పలుపురు గ్రామస్తులు అభినందనలు తెలిపి రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొని మరెన్నో పతకాలు సాధించాలని అన్నారు అనంతం సాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్,వార్డు సభ్యులు చింతలకోటి శ్రీనివాస్ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, బొంగాని శ్రావణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *