భర్త ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగం

చేర్యాల నేటిధాత్రి…

భర్త ప్రోత్సాహం.. తల్లిదండ్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగాం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది ఓ యువతి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సరిత గౌడ్ పేదరికం ఆత్మవిశ్వాసం ముందు నిలువదని నిరూపించింది.అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే కెమిస్ట్రీ విభాగంలో పిహెచ్ డి చేస్తూనే సరిత గౌడ్ 2024లో వెలువడిన నోటిఫికేషన్‌లో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది.ఈ సందర్భంగా సరిత గౌడ్ మాట్లాడుతూ ..నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ ఉద్యోగాం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన విజయం వెనుక తన భర్త డాక్టర్”బందారం వెంకటేశ్వర్లు గౌడ్, తల్లిదండ్రులు అనసూర్య సత్యనారాయణ గౌడ్ ల ప్రోత్సాహం.. అన్నదమ్ముల సహకారాన్ని మరువలేనన్నారు. ఈ మేరకు తమకు పూర్తి సహకారం అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లు కూతటి భాస్కర్, డాక్టర్ పి.మురళీధర్ రెడ్డి లు ఎంతో ప్రోత్సహించడం తోపాటు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. పేదరికాన్ని జయించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడం అభినందనీయమని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాం సాధించడంతో సరిత గౌడ్ ను పలువురు ఘనంగా సన్మానించారు. పేదరికంలో జన్మించినప్పటికి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాం సాధించడం గొప్పవిషయమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *