హైదరాబాద్,నేటిధాత్రి :
సుదీర్ఘ నెల రోజుల తర్వాత రాష్ట్ర గవర్నర్ ఆర్టీసీపై గురువారం ఆమోద ముద్ర వేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ తీర్మానం చేసి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించింది.
కాగా ఆ బిల్లును ఆమోదించాల్సిన గవర్నర్ తమిళసై పెండింగ్లో పెట్టారు.
నెలరోజుల వ్యవధి తర్వాత తెలంగాణ ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళసై కొద్ది సమయం క్రితం ఆమోదించారు.