ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

Governments

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

పంపిణీ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

గత ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు కుట్టు
మిషన్లు పంపిణీ చేయకుండా రైతు వేదికలో ఉంచిన 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పాడవుతున్నాయని వేంటనే తహాశీల్దార్ హేమ మహిళా దినోత్సవం రోజున అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ* చేయాలి.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
మంగళవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఉంచిన కుట్టు మిషన్లు పరిశీలించి అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీఎస్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన మహిళలకు మండలంలో ఉన్న గ్రామాలల నుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషను ఇచ్చి వారి కుటుంబం అభివృద్ధి చెందడం కోసం కుట్టు మిషన్లు తెప్పించి రైతు వేదికలో ఉంచిందని మహిళలకు పంపిణీ చేయకుండా అది రైతు వేదికకే పరిమితం అయ్యిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తహశీల్దార్ హేమ చొరవ తీసుకుని తక్షణమే అర్హులైన మహిళలకు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతు వేదికలో ఉన్న 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పోతాయని అన్నారు. మహిళలు వీటి ద్వారా సాధికారత సాధించి అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం వలన 60 కుటుంబాలను ఆదుకున్న వారిమి అవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి కార్యవర్గం సభ్యులు పుల్యాల సురేష్ నద్దునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!