వెల్గటూర్ నేటి ధాత్రి
వెల్గటూర్ మండల కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ మేరుగు మురళీ గౌడ్ తండ్రి చిలుకలయ్య గౌడ్ , అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ,ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి,వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, వారి వెంట పీసీసీ కార్య వర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు పీఎస్ ఆర్ , కేడిసీసీ బ్యాంక్ మాజి డైరెక్టర్ పోనుగోటి రామ్మోహన్ రావు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,
మేరుగు మురళి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ, ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామి!!
