గడ్డం వంశీని బారీ మెజారిటీ తో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరిన ప్రభుత్వ విప్ అడ్లూరీ
ఎండపల్లి నేటి ధాత్రి
వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామంలో సోమవారం రోజున నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఉపాది హామీ కూలీని 200 నుండి 400 వందలకు పెంచుతామని,ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ కార్య వర్గ సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గెల్లు శ్రీనివాస్ విజయ్ , తదితరులు పాల్గొన్నారు.
కప్పారావు పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్
