ప్రభుత్వ పథకాలు నిరుపేదల పాలిట గగన పుష్పాలు
◆:- సంక్షేమం నిరుపేదలది లబ్ధి సంపన్నులది అక్రమార్కులది
◆:- విచారణలోపమే పేద ప్రజల పాలిట శాపం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హాయంలో 972 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదల కోసం నిర్మించినారు ఇండ్లు పొందుటకు సొంత ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకోవాలని జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారు పత్రికా ముఖంగా ప్రజలకు తెలిపినారు అందుకు సొంత ఇండ్లు లేని నిరుపేద ప్రజలు దాదాపు8000 మంది సకాలంలో దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారిని జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 2400 మందిని లబ్ధిదారులుగా గుర్తించినారు కానీ వాస్తవానికి 972 ఇండ్లు
ఉండడంతో2400 మందిని డ్రా తీయగా పూర్తి స్థాయి అర్హులుగా 972 మందిని గుర్తించి ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేసినారు కానీ వాస్తవానికి జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారు లబ్ధిదారుల గుర్తింపులో విఫలం కావడంతో ఈ ఇండ్లను చాలామంది అక్రమార్కులు సంపన్నులు పొందినారు అక్రమార్కులు అనగా మన రాష్ట్రానికి చెందినవారు కారు జహీరాబాద్ పట్టణానికి చెందినవారు కారు వేరే నియోజకవర్గాల వారు వేరే జిల్లాల వారు చాలామందికి వ్యవసాయ భూములు స్థిర నివాస స్థలాలు వేరే రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నప్పటికిని అర్హులుగా గుర్తించి పేదవాడికి పేదవాడికి మధ్యన జరగాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లక్కీ డ్రా అక్రమార్కులకు సంపన్నులకు నిరుపేదలకు మధ్యన జరగడంతో చాలామంది అక్రమార్కులకు సంపన్నులకు ఇండ్లు డ్రా పద్ధతిన నెగడం జరిగింది అయితే ఇక్కడ ఒక విచిత్రం ఈ అక్రమార్కులు చాలామంది వారు పొందిన డబుల్ బెడ్ రూంలో నేటికీ మూడు
సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఇండ్లలోకి వెళ్లలేదు మరి కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా లోలోపల బంధువుల ముసుగులో అమ్మి వేస్తున్నారు వాస్తవానికి నిరుపేదలకు చెందాల్సిన ఇండ్లు అక్రమార్కులు పొందడంతో చాలామంది నిరుపేదలు నేటికీ రోడ్లపైనే జీవిస్తున్నారు ఈ జీవనంలో ఒక కుటుంబం గొల్ల మల్లన్న ఇంటి అద్దె చెల్లించలేక రోడ్డుపైన జీవిస్తూ తన తల్లి బస్టాండ్ లో జీవిస్తూ అక్కడే మరణించింది భార్యా పిల్లలు చాలీచాలని వసతులతో కూడిన ఇల్లును అద్దెకు తీసుకొని అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు వారికి ఇల్లు రాలేదని ఎలాగైనా ఇల్లు ఇప్పించాలని తెలిసిన నాయకులకు అధికారులకు కాళ్ళ వేల పడి బతిమిలాడుకుంటున్నారు చాలామంది అక్రమార్కులు జహీరాబాద్ నుండి ఆడపిల్లలు పెళ్లి చేసుకొని పోయి ఇక్కడ ఆధార్ కార్డు కలిగి ఉండడంతో ఇక్కడ నివసిస్తున్నట్లు దరఖాస్తు చేసుకొని ఇల్లు పొందినారు వాస్తవానికి వారి భర్తలకు వారి అత్తమామలకు ఇక్కడ ఎలాంటి గుర్తింపు ఉండదు ఇలాంటివారిని కూడా తాసిల్దార్ కార్యాలయం వారు విచారణ చేపట్టి లబ్ధిదారులుగా గుర్తించినారు దీని మూలంగా కూడా స్థానికులకు ఇండ్లు దక్కలేని పరిస్థితి దరఖాస్తు ఇచ్చినప్పుడు వాస్తవానికి తాసిల్దార్ కార్యాలయం వారు 90 డిగ్రీ సర్వే ఉంటుంది అని చెప్పినారు కానీ వాళ్ళు చేసిన సర్వే అంతా కూడా పటిష్టమైన 90 డిగ్రీస్ కోణం సర్వే కాదు కొంతమంది లబ్ధిదారులు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు ఇంకా కొంతమంది తహసిల్ కార్యాలయంలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు వారి బంధువుల పేర్లను కూడా గుట్టు చప్పుడు కాకుండా రాసుకున్నారు ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజలు ప్రతిరోజు నాయకులకు అధికారులకు తమ ఇష్టం వచ్చినట్లు చివట్లు పెడుతూ ఉన్నారు ఇండ్లు పొందిన కొంతమంది లబ్ధిదారులు పొందిన ఇంటిని సంపన్నుల వలె ఫాల్ సీలింగ్స్ వాల్ లపం వాసు ప్రకారంగా ఎక్కడబడితే అక్కడ దర్వాజలు పగలగొట్టడం వారి పైన ఇల్లు వచ్చిన వారికి తగులు పెట్టుకొని బాత్రూంలు బంద్ చేయించడం చేస్తూ ఉన్నారు కావున ఇకనైనా సూక్ష్మంగా సర్వే జరిపించి కొంతమంది అనారులు ఇంకా ఉన్నారు వారిని ఇండ్లలో నుండి తొలగించి నిజమైన నిరుపేదలకు గుర్తించి వారికి అందేలా చూడాలని లోలోపల అమ్ముకున్న వారిని విచారణ జరిపి వారి ఇండ్లను కూడా రద్దుచేసి నిరుపేదలకు అందేలా చూడాలని తాసిల్దార్ కార్యాలయం ప్రకటనతో అక్రమంగా ఇండ్లు పొందిన వారి అభ్యంతరాలను తెలుపాలని తెలియజేయగా నేరుగా కొంతమంది లబ్ధిదారులు సకాలంలో దరఖాస్తు చేసిన జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారు పట్టించుకోలేదు కావున సూక్ష్మ విశా విచారణ జరిపి నిజమైన పూర్తి హరత కలిగిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగా కోరుచున్నది కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఫసి మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ అరవింద్ బాలు సన్నీ బి. బాలు గార్లు పాల్గొన్నారు,
