అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలి
సర్పంచులు లేకపోవడంతో స్తబ్దుగా ఉంటున్న గ్రామపంచాయతీలు
వివాదాలకు నిలయంగా మారుతున్న ఖాళీ స్థలాలు
పరిష్కారం చూపలేకపోతున్న ఖాకీలు
నేటి ధాత్రి ఐనవోలు :
అయినవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో గూడు లేని నిరుపేదలకు గత ప్ర భుత్వాలు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా మిగులు భూమి అన్య క్రాంతం అవుతుంది.వివరాల్లోకి వె ళితే హనుమకొండ జిల్లా,ఐనవోలు మండలం,కక్కిరాలపల్లి గ్రామంలో
గత ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల నుండి భూమిని కొనుగోలు చేసి తిరిగి గూడు లేని నిరుపేదలకు పం పిణీ చేయగా, మిగులు భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉం ది.కాగా ఊర చెరువు కట్టకింద ఉన్న సర్వే నెంబర్ 2,6 లో 4 ఎకరాల 06 గుంటల భూమి డబుల్ బె డ్రూం ఇండ్లకి,1ఎకరం పల్లె ప్రకృతి వనాని కి పోగా మిగతా ఎనిమిది గంటల మిగులు భూమి కలదు.అలాగే ఎస్సీ కాలనీ 9వ వార్డులో మెయిన్ రోడ్డుకు అను కొని ప్రభుత్వం కొన్ని దళితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా మిగులు భూమి ఉంది.

గ్రామ పంచాయతీ పాలకవర్గం లేక పో వడంతో అడిగే వారు లేక కొందరి కబ్జాదారుల కన్ను అట్టి మిగులు భూము లపై పడింది. అంతేకాకుండా ఎస్సీ కాలనీలో ఉన్న మిగులు భూమి పక్కన ఉన్న వారి మధ్య అట్టి భూమి కోసం తరచు గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అట్టి భూములు అన్యక్రాంతం కాకుండా అధికారులు స్పందించి గ్రామ పం చాయతీ ఆధీనంలోకి తీసుకుంటే ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునే వీలుంటుందని గ్రామస్తులు వేడుకుంటున్నారు. దీనిపై వివరణ కోసం తాసిల్దార్ విక్రమ్ కుమార్ ను చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.గ్రామ కా ర్యదర్శి నిర్మల్ కుమార్ ను వివరణ కోరగా ఎస్సీ కాలనీలో ఇండ్ల స్థ లాలు పంపిణీ చేయగా మిగులు భూమి ఉన్నప్పటికీ గ్రామ పంచా యతీ రికార్డులో లేదన్నారు.ఇట్టి విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసు కెళ్తానన్నారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎన్నో పంచాయతీలు వస్తున్నాయి కానీ వివాద కారణమైన స్థలం ప్రభుత్వం కేటాయించిన స్థలం కావడంతో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.