
Government job.
చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
◆:-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
◆:-వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షులు బి.రామచందర్
జహీరాబాద్/ఝరాసంగం:వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామచందర్, మాట్లాడుతూ ఝరాసంగం మండలం చీలపల్లి గ్రామంలో మూడు నెలల వేతనాలు రాకపోవడం, అధికారుల ఒత్తిళ్లు వలన కుంగిపోయి చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శివన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు.ఫీల్డ్ అసిస్టెంట్లకు అధిక పని భారం పెట్టి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వలన కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది అని ప్రభుత్వం వెంటనే బకాయిలు ఉన్నటువంటి వేతనాలను చెల్లించి ఫిల్ అసిస్టెంట్లను ఆదుకోవాలని వారు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చంద్రన్న, ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షులు ఈశ్వరప్ప పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.