
SFI leaders.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు
బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు చదువుకుందామని
కాలేజీకి వస్తే రూమ్స్ లేక
తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాణ్యతగా నిర్మించి త్వరగా పూర్తిచేయలన్నారు.స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వెంటనే స్పందించి కాంట్రాక్టర్ లకు ఆదేశాలిచ్చి త్వరగాతినా బిల్డింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్,మహేష్,విజయ్,అరుణ్,సాయి కృష్ణ పాల్గొన్నారు.