భద్రాచలం నేటిదాత్రి
మండల వ్యాప్తంగా 1500 మంది హాజరు.
-ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ కు అపూర్వ స్పందన.
భద్రాచలం
విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, భయాన్ని తగ్గించేందుకు ఎస్ఎఫ్ఐ 10వ టాలెంట్ టెస్ట్
యస్,భూపేందర్
జిల్లా ఉపాధ్యక్షులు
భారత విద్యార్థి ఫెడరేషన్ యస్ యఫ్ ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 తేదీలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ మొదటి రోజు భద్రాచలం మండల కేంద్రాల్లో నిర్వహించగా 1500 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చడువుతున్న 10వ తరగతి టాలెంట్ టేస్ట్ నిర్వహించారు. భద్రాచలం పట్టణ కేంద్రంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాచలం విద్యాశాఖ అధికారి (యం ఈ ఓ ) సమ్మయ్య హాజరై టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రావళిని ప్రారంభించి, అనంతరం విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు, విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తగ్గించేందుకు ఎస్ఎఫ్ఐ పదవ తరగతి టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరానికి వెళ్తారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఇలాంటి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం చాలా మంచి కార్యక్రమమని ఆయన అన్నారు. జిల్లా అధ్యక్షులు అభిమన్యు, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ భూపేందర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఎస్ఎఫ్ఐ పదవ తరగతి విద్యార్థులకు జిల్లా మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని
ఈ పరీక్ష గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో నిష్ణాతులైన వారిచే ప్రశ్నాపత్రం రూపొందించినట్లు పేర్కొన్నారు.10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎస్ఎఫ్ఐ నిర్వహించే టాలెంట్ టెస్ట్ విద్యార్థుల మెదళ్ళ మానసిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉంటుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు చదువుల్లో రాణించాలని,10వ తరగతి ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అన్నారు. మండల స్థాయిలో రాణించిన మొదటి 5 మందికి జిల్లా స్థాయి స్థాయి టాలెంట్ టెస్ట్ ఈ నెల 24న నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లా స్థాయిలో రాణించిన మొదటి 3 గురికి రూ.5000,3000,1500 మరియు షీల్డ్స్ అందించనున్నట్లు తెలిపారు. టాలెంట్ టెస్ట్ కు జిల్లా ఉపాధ్యక్షులు సందీప్, రవీంద్ర, కార్తిక్, అరవింద్ శిరీష ,తదితరులు పాల్గొన్నారు