జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా ,హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ ప్రింటింగ్ మరియు ప్యాకేజ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. భారత రాష్ట్రపతి మరియు హర్యానా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా గోషిక వెంకటేష్ మాట్లాడుతూ , హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని తన కృషికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సహంతో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను మొదట డిప్లొమా, జి జె యు నుండి బి. టెక్ , ఎం. టెక్ చేసాను. దీని తరువాత నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసాను మరియు కొన్ని సంవత్సరాల తరువాత – నాకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు నా డిగ్రీ మరియు పతకాన్ని స్వీకరించడానికి జి జె యు హిసార్ హర్యానాకు పిలువబడిందన్నారు. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు