పరకాల మండలంలో బంగారం,నగదు చోరీ

తులంనర బంగారం చోరిచేసిన గుర్తుతెలియని వ్యక్తులు

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామంలో కంకణాల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో శ్రీనివాస్ రెడ్డి అవసరనిమిత్తం వ్యవసాయ బావి బావి దగ్గరకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువాను పగలకొట్టిన బీరువాలోని తులం నర బంగారం మరియు 10000 రూపాయల నగదు దొంగలించారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గత పదిహేను రోజుల కిందట దొంగతనం కూడా ఆ కాలనిలో దొంగతనం జరిగిందని కాలనీ వాసులు తెలిపారు.సిసి కెమెరాలు ఉన్నప్పటికీ చాకచక్యం ప్రదర్శించి వాటికంట పడకుండా తప్పించుకున్నారంటే గ్రామవాసులే ఇ దొంగతనానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *