అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం మహోత్సవం

ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా భోగి పండగను పునస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి లలిత గోవర్ధన్ దంపతుల శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు గోవర్ధన దుర్వాస చార్యులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ స్వామివారి కళ్యాణాన్ని వేదమంత్రాలతో వైష్ణవ సాంప్రదాయ విధంగా జరుపబడింది అని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండారి శంకర్ మోటపోతుల రాజన్న గౌడ్ మాదాస్ మొగిలి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మూల శ్రీనివాస్ గౌడ్ దెయ్యాల భద్రయ్య బటిక స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!