హరీష్ రావు సభకు భారీగా తరలిరండి : బిఆర్ఎస్ నాయకుడు రాము యాదవ్ పిలుపు

మల్కాజిగిరి
01 నవంబర్

మంత్రి హరీష్ రావు గురువారం మల్కాజిగిరి లోని షికారి మల్లయ్య గార్డెన్లో జరిగే టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నట్లు బిఆర్ఎస్ నాయకుడు రాము యాదవ్ పేర్కొన్నారు.బుధవారం గౌతమ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాము యాదవ్ మాట్లాడుతూ మల్కాజిగిరి బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మంత్రి హరీష్ రావు సభకు గౌతంనగర్ డివిజన్ నుండి సుమారు 3000 మంది పాల్గొనాలని ఉదయము 11 గంటలకు జరిగే కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పివి సత్యనారాయణ,సిద్ధిరాములు,కృష్ణ గౌడ్,నగేష్ గౌడ్,వేణు నాయుడు, నర్సింగ్,అనిత,పంగకిషన్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *