
Gandam Ravi and Peddalachanna
జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి
జిఓ నెంబర్ 49 రద్దు చేయకపోతే కార్మికవర్గాన్ని కలుపుకొని ఐక్య పోరాటాలే…
బడాపెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగానికేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా…
గందం రవి, పెద్దలచ్చన్న
సిఐటియు మందమర్రి మండల నాయకులు.
ఈరోజు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ లో భాగంగా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో సింగరేణి సివిక్, రైల్వే సైడ్ అడ్డలలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు అధ్వర్యంలో నిరసన,జీఓ కాఫీల ధగ్దం చెయ్యడం జరిగింది.
బీజేపీ మోడీ ప్రభుత్వం ఆదివాసీ,
పేదలను వారి గ్రామల నుంచి,భూముల నుంచి వెళ్లగొట్టడం కోసం అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది.వీటిని రాష్ట్రంలో అమలు జరపడం కోసం బిజెపి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీఓ నంబర్ 49 తీసుకురావడం జరిగింది. ఈ జి ఓ అమలు జరపడం కోసం దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తున్నది.దీని వలన 339 గ్రామాలు,3 లక్షల ఎకరాల భూమిని ఆదివాసీలు,పేదలు కోల్పోవడం జరుగుతుంది.మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కవ్వల్ టైగర్ జోన్,ప్రాణహిత కృష్ణ జింకల ప్రాంతం,శివ్వారం మొసళ్ళ కేంద్రం పేర్లతో ఆంక్షలు విధించడం జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఆదివాసీలకు,పేదలకు వ్యతిరేకంగా, వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసేలా ఉన్నాయి. అలాగే కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు, బడాపెట్టుబడిదారులకు బానిసలను చేసే కుట్రలను కూడా బిజెపి మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ఆదివాసీ, గిరిజన, పేదలే కాకుండా కార్మికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాలను విరమించుకోకుంటే ఐక్య
పోరాటాలను ఉధృతం చెయ్యడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్షుడు గందం రవి, మండల నాయకులు పెద్దలచ్చన్న, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, రాజయ్య, బానయ్య, రవీందర్, వెంకటేషశ్వర్ రావు, నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.