సింగరేణి ఏరియా హాస్పిటల్ ని సందర్శించిన జిఎం మనోహర్

మందమర్రి, నేటిధాత్రి:-

సింగరేణి ఏరియా హాస్పిటల్ ని మందమర్రి ఏరియా జిఎం మనోహర్ శనివారం సందర్శించారు. జిఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా ఏరియా హాస్పిటల్ ని సందర్శించిన సందర్భంగా డివైసీఎంఓ డాక్టర్ ఉషారాణి, ఏరియా హాస్పిటల్ వైద్యులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో జిఎంను ఘనంగా సన్మానించారు. అనంతరం జిఎం హాస్పిటల్ లోని వార్డులు, ఓపి విభాగాలు, వేస్ట్ వాటర్ ప్యూరిఫై ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ లను తనిఖీ నిర్వహించి హాస్పిటల్ స్థితిగతులను పరిశీలించారు. అలాగే సింగరేణి ఉద్యోగస్తులకు మంచి వైద్యం సదుపాయాలును అందించాలని డాక్టర్ లకు, సిబ్బందికి సూచనలు సలహాలు తెలియజేశారు. అనంతరం రీజనల్ ల్యాబ్, ఆర్కేసి ఓఏ క్లబ్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజిఎం నాగరాజు, డివైసిఎంఓ డాక్టర్ ఉషారాణి, ఎస్టేట్ అధికారి కుమారస్వామి, ఆర్కేపి ఓసి ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు, మేనేజర్ వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్
హాస్పిటల్ ఫిట్ కార్యదర్శి ముద్దసాని కృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నక్కా సురేష్ బాబు, సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, కమిటీ మెంబర్స్, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!