Vote for Development: Congress Election Campaign at Adrak Pally
అభివృద్ధి కి పట్టం కట్టండి : మాజీ మేయర్, ఎంసీ పల్లి ఎన్నికల ఇంచార్జి తోటకూర అజయ్ యాదవ్
* అద్రాక్ పల్లి లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సంక్షేమ అభివృద్ధి పలాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్, ఎంసీ పల్లి ఎన్నికల ఇంచార్జి తోటకూర అజయ్ యాదవ్ కోరారు. మూడుచింతల పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అద్రాస్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పులి ప్రభాకర్, మేడమైన నాగరాజు ల తరపున గురువారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ నరసింహులు యాదవ్, జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కుతాడి సాయికుమార్, యాదగిరి, గడ్డమిడి విజయ్, మాజీ సర్పంచ్ పత్తి యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.
