8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.. బిజెపిలో సభ్యత్వం పొందండి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గడ్డం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమo నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా జిల్లా బిజెపి అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడు తూ దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అనికొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నీ చూస్తున్నామని, రాష్ర్టఅభివృద్దినీ కుంటుపడే లా చేస్తున్నారని, 2047 వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని లక్ష్యంతో ప్రధాని మోడీ పని చేస్తున్నార న్నారని అన్నారు. ఎందుకోసం తెలంగాణ కావాలని కోరుకున్న మో అది నెరవేరాలి అంటే బీజేపీ అధికారం లోకి రావడం అవసరమనన్నారు. ప్ర‌ధాన మంత్రి నిర్దేశించిన ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిరాశతో ఉన్నందున ఉత్సహంగా పార్టీ సభ్యులు అవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకులు మొగిలి ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు బీజేవైఎం ఉపాధ్యక్షులు కొత్తపల్లి శ్రీకాంత్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి భూత్ అధ్యక్షులు కోమటి రాజశేఖర్ కడారి చంద్రమౌళి వీరస్వామి తిరుపతి సీతారాం రెడ్డి సుమన్ ఎర్ర తిరుపతి రెడ్డి సుధాకర్ రఘుపతి తదితరుల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!