పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

25న స్టేడియంలో బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ

ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 18

ఉప్పల్ త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో 25న బూతు స్థాయి ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ గారు మరియు ఇతర నాయకులతో కలిసి పరమేశ్వర్ రెడ్డి ఎల్బి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
మల్కాజ్ గిరి పార్లమెంట్ లో మరోసారి కాంగ్రెస్ జెండాను ఎగరవేసే విధంగా అందరం సమిష్టిగా కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!