మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం

చైర్మన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా లో పొందుపరిచిన అంశాలు మరియు టేబుల్ ఎజెండా లో పొందుపరచిన అంశాల పై పాలకవర్గ సభ్యులతో మరియు కోఆప్షన్ సభ్యులతో చర్చించి ఇట్టి అంశాలను పాలకవర్గ సమావేశంలో ఆమోదం చేయనైనది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరచిన అంశాలను పాలకవర్గ సభ్యులతో చర్చించి అంశాలను ఆమోదం తెలపడం జరిగిందని వారన్నారు, వేములవాడ పట్టణంలో మున్సిపల్ నుండి చేయబోయే పలు అభివృద్ధి పనులపై మరియు వచ్చే నెలలో మహాశివరాత్రి పండుగ ఉన్నందున మున్సిపల్ తరఫున చేయబోయే ఏర్పాట్లపై పాలకవర్గ సభ్యుల తో చర్చించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు వార్డులలో పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకవస్తే అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా కౌన్సిలర్ చెప్పినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు.ఈ సమావేశంలో కమిషనర్ అన్వేష్, మేనేజర్ సంపత్ రెడ్డి, ఏ ఈ లు నరసింహస్వామి, నర్మద,పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!