గౌరిశెట్టి కనకలక్ష్మీకి ఘన నివాళులు

ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న జర్నలిస్ట్ యూనియన్ సంఘం నాయకులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమేట్ల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంతోష్ నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా ఆమె దశదినకర్మను సోమవారం కుటుంబ సభ్యులు వారి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, ప్రెస్ క్లబ్ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, ప్రెస్ క్లబ్ మండల ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్ లు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!