
Ganja Smugglers
హనుమకొండలో గంజాయి పట్టివేత
#స్మగ్లర్స్ నలుగురు అరెస్ట్
హన్మకొండ, నేటిధాత్రి:
ఈరోజు హన్మకొండ పోలీస్ మరియు తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆద్వర్యంలో ఉదయం హన్మకొండ లోని కుమార్పల్లి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కి దగ్గరలో ఉన్న నలుగురు వ్యక్తులు ఎండు గంజాయి కలిగి ఉన్నారని నమ్మదగిన సమాచారం రాగా టి ఎస్ ఎన్ ఏబి సీఐ శ్రీకాంత్ మరియు యస్.ఐ. సిహెచ్. పరశురాములు తమ సిబ్బందితో అక్కడకు వెళ్లేసరికి అక్కడ నలుగురు వ్యక్తులు మహీంద్రా ఎక్స్ యు వి కారులోగంజాయిని తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి 25 కిలోల 800 గ్రాముల ఎండుగంజాయి, ఐదు సెల్ ఫోన్స్ లు, ఎక్స్ యు వి మహేంద్ర గల కారు మరియు వారు ప్యాకింగ్ చేసే కవర్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి పోలీస్ స్టేషన్ కు తీసుక రాగా హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ గారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినారు. ఈ నలుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ పంపడమైంది.
ఇందులో కరీంనగర్ టౌన్ కి చెందిన ముగ్గురు నేరస్తులు
1) ఎండి. ఫైజాన్, తండ్రి: మున్నిర్ వలి, వయస్సు: సం
2) ఎస్డి. అన్సార్, S/o ఎస్డి. యూసుఫ్, వయస్సు: 24 సంవత్సరాలు
3) ఎండి. అర్బాస్, S/o అన్సార్, వయస్సు: 24 సంవత్సరాలు, కలిసి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ నుండి ఇట్టి గంజాయిని బాలు అనే వ్యక్తి వద్ద నుండి తీసుకువచ్చి ఇక్కడ హనుమకొండ లోని కుమార్ పల్లికి చెందిన నిందితుడు
4) అర్షద్ అలీ ఖాన్, S/o లాయక్ అలీ ఖాన్, వయస్సు: 37 సంవత్సరాలు, ఇంట్లో ప్లాన్ ప్రకారం దాచి అవసరమైన వాళ్లకి అమ్ముదామనే ఉద్దేశంతో ఈరోజు గంజాయిని వెహికల్ లో తీసుకెళ్తుండగా పోలీసు వారికి పట్టుబడ్డారు
ఈ సందర్భంగా హన్మకొండ ఏసీపీ నరసింహ రావు యువతను ఉద్దేశించి ఇలాంటి వ్యాసనాలకు అలవాటు పడితే ఆనరోగ్యంతో పాటు కటకటాల పాలై జీవితం సర్వనాశనమవుతుందని, చదివిన చదువు వ్యర్ధం అవుతుందని చెప్పినారు. అలాగే గంజాయిని అమ్ముతున్నవారి, త్రాగుతున్నవారి వివరాలు తెలిసినచో పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని చెప్పినారు.