మిట్టపల్లి గ్రామంలో ముగిసిన గణేష్ ఉత్సవాలు

జైపూర్, నేటి ధాత్రి:

మిట్టపల్లి గ్రామంలో ముగిసిన గణేష్ ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మిట్టపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద నెలకొల్పిన విగ్నేశ్వరుడి యొక్క లడ్డు వేలంపాటలో 15,616 రూపాయలతో జుంబిడి మౌనిక సాయికుమార్ దంపతులు అలాగే 2 కేజీల లడ్డుని విగ్రహ దాత రామ టెంకి సమ్మయ్య రుతిక దంపతులు 5 కేజీల లడ్డుని వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో లడ్డుని వేలంలో పొందిన వారికి ఇచ్చారు. గణపతికి పూజలు చేసి గ్రామంలో గణపతిని ఊరేగింపు కార్యక్రమం చేసి గ్రామ పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి గ్రామస్తులు పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *