
Ganesh Laddu Auction Hits ₹2.1 Lakh in Shereilingampally
గల్లీ క గణేష్ ఉత్సవ కమిటీ గణనాథుడి లడ్డు వేలం పాట 210000.రూ
శేరిలింగంపల్లి నేటి ధాత్రి :-
గల్లిక గణేష్ ఉత్సవ కమిటీ నేతాజీ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వినాయక నవరాత్రి పూజలు.ఇందులో భాగంగా నిన్న రాత్రి జరిగిన లడ్డు వేలంపాటలో గణేశుని లడ్డూ బారి దార పలికింధి. మొదటి లడ్డు గుంటి యాదగిరి సాగర్ 210000 దక్కించుకోగా రెండవ లడ్డు దయాకర్ సాగర్ 108000 కి కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లడ్డును వారికి అందచేసి అభినందనలు తేలిపారు.అనంతరం వినాయక అనుగ్రహం వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా వుండలని ఆ దేవునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తేలిపారు.