గండ్ర శోభ హరీష్ రెడ్డిని గెలిపించండి గండ్ర జ్యోతి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పుల్లూరి రామయ్య పల్లి,గండ్రపల్లి, మంజూరునగర్ లో ప్రతి ఇంటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి గండ్ర శోభా హరీష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
