భూపాలపల్లి అభివృద్ధి జరగాలంటే మళ్ళీ గండ్ర రమణారెడ్డి కే పట్టం కట్టాలి.

బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు తౌటం నవీన్.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో యూత్ అధ్యక్షులు తౌటమ్ నవీన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు,ఈసందర్భంగా
యూత్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి పనులో పథకాలతో చిట్యాల మండలం ముందుకు తీసుకెళ్తున్నారని, మండలం మరింత అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిచేసిన పనులు పథకాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలి మరియు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిపించాలని యూత్ అధ్యక్షులు తౌటం నవీన్ యువత కు పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *