జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్ గణపతి గురువారం రోజు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ అన్ని వేళల్లో ప్రజల పక్షాన ఉంటూ న్యాయపరమైనటువంటి సేవలు అందించడానికి తన సాయ శక్తుల కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరలో పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇచ్చారు.