కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న గామా చారిటబుల్ ట్రస్ట్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో గామ చారిటబుల్ ట్రస్ట్ మంథని ముత్తారం మండల కో ఆర్డినేటర్ ఏకు సతీష్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా నిత్యవసర వస్తువులు ట్రస్ట్ లో సభ్యత్వం తీసుకున్నవారికి మాజీ ఎంపీటీసీ లు అల్లం తిరుపతి బండారి సుధాకర్ మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య ఎస్సి సెల్ డివిజన్ సెక్రటరీ మాట్ల రవి పాస్టర్ ఏకు శామ్యూల్ చేతులమీదుగా అందచేయడం జరిగింది అనంతరం మండల కో ఆర్డినేటర్ మాట్లాడుతూ గామ చారిటబుల్ ట్రస్ట్ సి ఈ ఓ కె దుర్గాప్రసాద్ పేదలకు సహాయం సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ట్రస్ట్ ను స్థాపించారు గామా ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఒక్కసారి ఆహారభృతి లో భాగంగా 500 రూపాయలు రుసుము చెల్లించి కె వై సి చేసుకున్నవారికి 9నెలలు పాటు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తారు జీవనభృతి లో భాగంగా 2000రూపాయలు రుసుము చెల్లించి కె వై సి చేసుకున్న వారికీ ప్రతి నెల ట్రస్ట్ ద్వారా వారికీ 9నెలలు 1000 రూపాయలు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తారు ఉద్యోగ భద్రత లో భాగంగా యువతీ యువకులకు ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ లో పని చేసుకునుటకు అవకాశం కలిపించబడునని తెలిపారు మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు 9398371025 జిల్లా కో ఆర్డినేటర్ కె సరోజన
9177170102 ఇ సతీష్
మండల కో ఆర్డినేటర్ సంప్రదించగలరని తెలిపారు గామా చారిటబుల్ ట్రస్ట్ సి ఈ ఓ కె దుర్గ ప్రసాద్ కు ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు రొడ్డ రమేష్ మడిపెల్లి దేవేందర్ మంథని సారయ్య మంథని వంశీ పంగ యశోద కోలుగూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *