నేడు జట్టుతో చేరనున్న గంభీర్

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్ గుండెపోటుకు గురైనందున…
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్ గుండెపోటుకు గురైనందున అతడు ఈనెల 12న స్వదేశానికి వచ్చాడు. గౌతీ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ..ఆమె ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కెంట్లో ఉన్న భారత జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టు కోసం మంగళవారం హెడింగ్లీకి బయల్దేరి వెళ్లనుంది.