మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాడ వాడల గడపగడప ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కల్పించారనికళ్యాణ లక్ష్మి గాని రైతుబంధు గాని బీసీ బందు గాని మైనార్టీ బంద్ గాని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అలాగే మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు తెలంగాణ వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచారని అందులో ముఖ్యంగా మన తంగళ్ళపల్లి మండలానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పరిచారని వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు ఎంపిటిసి కోడి అంతయ్య స్థానిక ఉపసర్పంచ్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దూరి తిరుపతి పాక్స్ వైస్ చైర్మన్. వెంకట రమణారెడ్డి పట్టణఅధ్యక్షులు జగన్ మైనార్టీ నాయకులు అమిధ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!