*గోపనపల్లి లో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి *

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- \

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి గ్రామం లో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, గ్రమంలో ని ప్రజలoదరు సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఆపశుభాలు జరుగకుండా ఉండాలని పూర్వకాలంలో మన పెద్దలు బొడ్రాయిని ప్రతిష్టించే వాళ్ళని తెలిపారు. ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళాలన్నా, వేరే గ్రామం నుండి వచ్చేవాళ్ళైనా బొడ్రాయిని పూజించే వాళ్ళని పేర్కొన్నారు. గ్రామం లోకి ఏ దృష్ట శక్తులు గ్రామం లోకి రాకుండా బొడ్రాయి కాపాడుతుందని మన పెద్దల నమ్మకం అని, మధ్యలో దీనిపై కొంత అశ్రద్ధ వహించడం వల్ల, నేటి తరానికి అవగాహనా లేకుండా పోయిందన్నారు. మళ్ళీ పూర్వపు విదంగా బొడ్రాయి ని పూజించడం జరుగుతుందని, నగర విస్తరణ లో భాగంగా కాలనీలు విస్తరించడం తో బొడ్రాయి పై అవగాహనా లేకపోవడం వల్ల మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశిర్వాదం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోచయ్య,రవీందర్ ప్రసాద్ దుబే,చంద్రమౌళి, నరసింహ,యాదయ్య, రాజు, రాజేందర్ ,అనిల్ ,రంగస్వామి, విష్ణు, చిన్నా, శివ, శ్రీకాంత్ ,నర్సింగ్ రావు, శివ,శంకర్, గోపనపల్లి వాసులు,స్థానిక భక్తులు, మహిళలు,పిల్లలు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!