కమలాపూర్ మండల ప్రత్యేక అధికారిగా జి రామ్ రెడ్డి

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)

తెలంగాణ వ్యాప్తంగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల పదవీకాలం బుధవారంతో ము గియడంతో జిల్లా స్థాయి అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. కమలాపూర్ మండల ప్రత్యేక అధికారిగా హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జి రామ్ రెడ్డి జిల్లా కలెక్టర్ నియమించారు. గురువారం కమలాపూర్ మండల పరిషత్ లో మండల ప్రత్యేక అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *