G.O.Ms.no.3ను చట్టం చేయాలి..
ఆదివాసి సంక్షేమ పరిషత్ మండలం అధ్యక్షులు తూర్స, క్రిష్ణ బాబు.
నూగూర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ):
మంగళవారం నాడు వెంకటాపురం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీల రక్షణకై ఏర్పాటు చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో పనిచేస్తున్న వంటి ప్రభుత్వ అధికారులు కూడా గిరిజన ఇతరులకు అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకు హక్కులు కావాలని సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆదివాసుల పొట్టలు కొడుతూ G.O.Ms
no.3 ని కాజేశారని మండిపడ్డారు. జీ.ఓ.ఎంఎస్. నెం. 3ను మినీ అసెంబ్లీ అయినటువంటి ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీలో మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలను పరిరక్షించుటకై 5 మే 2025 న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటి నాగరాజు, బొగ్గుల రాజ్ కుమార్, బొగ్గుల ప్రశాంత్, గట్టుపల్లి సంజయ్, పూణేం అర్జున్, తాటి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.