పోత్కపల్లి నూతన ఎస్సైగా జి.అశోక్ రెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై గా జి.అశోక్ రెడ్డి శుక్రవారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకారం అందించాలని, ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. మహిళా రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తాయని, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!