
Full of dirt.. No staff.
మురికి ఫుల్.. సిబ్బంది నిల్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ 12వ వార్డులో మురికి కాలువలను నెలరోజులుగా శుభ్రం చేయకపోవడంతో మురికినీరు రోడ్లపై పారుతోంది. మున్సిపల్ అధికారులు ఇతర కాలనీలను పరిశీలిస్తున్నప్పటికీ, ఈ వార్డును పట్టించుకోవడం లేదు. శానిటైజర్ సూపర్వైజర్ సిబ్బందిని వేరే ప్రాంతాలకు పంపుతున్నారు. అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించి శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు