తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి
తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు
పరకాల నేటిధాత్రి
రాష్ట్ర సర్కారు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆర్డిఓ డాక్టర్, కె.నారాయణ కు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో వరి పంట సాగులో ఉన్నదని,యాసంగి వరి పంటకు దోమ పోటు,అగ్గి తెగులు,వడగండ్ల వానలతో కోలుకోలేని విధంగా గతంలో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని గుర్తు చేశారు.మామిడి పంట కూడా చాల సందర్భాలలో పంట కోసే ముందు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వెల్లడించారు.పంటల భీమా పథకం అమలులో ఉంటే, రైతు ప్రభుత్వం దయాదాక్షి ణ్యములపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదని,హక్కుగా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం పొందే వీలుంటుందని చెప్పారు.లేనిచో ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ పరిహారం తో సరి పెట్టుకొని అప్పుల పాలై పెద్ద ఎత్తున వడ్డి సంవత్సర కాలం కడుతూ నష్టపోవలిసి ఉంటుందని వివరించారు.ఇప్పటికే పంటలు ఎండుతున్నట్టు,రైతు ఆత్మహత్యలు అక్కడక్కడ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నవని,రాష్ట్రములో రుణ మాఫీ పూర్తి స్థాయి లో అమలు కాక,రైతు భరోసా కొరకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో తెలువని పరిస్థితి లో రైతులు దిగులుతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రకృతి వికటించి పెద్ద ఎత్తున నష్టం జరిగినచో రైతు తట్టుకోలేడని ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతానికి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు చేసే అవకాశం లేనందున భవిష్యత్తు లో పంట నష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్న వరి,మిరప మొక్కజొన్న మామిడి పంటల రైతులకు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని పంటల భీమా పథకం అమలు పరిచే కంపెనీల తో చర్చలు జరిపి, వారిని ఒప్పించి అతి తక్కువ ప్రీమియం తొ ఇప్పటినుంచి పంటలు చేతి కి వచ్చే వరకు పంటల భీమా పథకం అమలు చెయ్య వలిసినదిగా విజ్ఞప్తి చేశారు.రైతును పూర్తి స్థాయిలో ఆదుకొనే చర్యలు వెంటనె చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు సురావు బాపూరావు,లోనే సతీష్,కోడెం రవీందర్ తదితరులు రైతులు పాల్గొన్నారు.