సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పశువులకు పాల దిగుబడి తగ్గకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అలాగే ఆసుపత్రులు అందుబాటులో లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే గర్భకోశ వ్యాధులు ఎక్కువగా ఎదురవుతున్నందున రైతులు ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో పశువులకు వైద్యం నిర్వహించాలని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నందున బొత్త వాపు గాని జబ్బ వాపు గాని రావడం జరుగుతుందని సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు పశువులపై ప్రత్యేక దృష్టి కేటాయించి ఇటువంటి వైద్య శిబిరాలకు తీసుకువచ్చి తగిన వైద్యం తీసుకోవాలని రైతులకు సూచించారు అలాగే గ్రామంలో రైతులందరికీ పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారుఇట్టి ఉచిత పశు వైద్య శిబిరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ డైరెక్టర్లు నక్క నరసయ్య దుబాల వెంకటేశం భరత్ గౌడ్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు