Free Cancer Screening Camp Held in Wanaparthy
వనపర్తి లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత
ఉచిత క్యాన్సర్ వ్యాధి శిబిరం
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ సి ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య జర్నలిస్ట్ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేషెంట్ కు దాదాపు 7000 రూపాయలు టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు . డాక్టర్ సుష్మ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు దాదాపు 150 మంది వరకు పేషెంట్లు వచ్చారని వారు తెలిపారు పేషెంట్లకు క్యాన్సర్ అని నిర్ధారణ తెలిస్తే అవసరం ఉంటే పేషెంట్ల ను ఉచితంగా హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ కు డాక్టర్ రెఫర్ చేస్తున్నామని వారు తెలిపారు . అక్కడ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు ప్రతి గురువారం శ్రీ సత్య సాయి సేవ సంస్థ మందిరంలో హోమియోపతి డాక్టర్ చే ప్రజలకు ఉచితంగా పరీక్షించి ఉచిత హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు విశ్వ జ్యోతి రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ శ్రీ సత్య సాయి మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు శ్రీ సత్య సాయి సేవాదళ్ పాండురంగయ్య కోఆర్డినేటర్ శ్రీరామ్ రెడ్డి శ్రీ సత్య సాయి సేవ దళ్ భక్తులు పేషెంట్లకు సహకరిస్తున్నారు ఈ మేరకు పేషెంట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు
