శ్రీ చైతన్య లో ప్లానెట్ ఆప్టిక్స్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరం

డాక్టర్ బి.ఎస్.రావు భవన్, హెచ్ బి కాలనీలో కంటి పరీక్షల క్యాంపు..

కాప్రా నేటిధాత్రి జవహర్ నగర్:

శ్రీ చైతన్య పాఠశాల డాక్టర్ బి ఎస్ రావు పేరు మీద స్థాపించిన మొట్టమొదటి బాలికల వసతి గృహం కో ఎడ్యుకేషన్ డేస్ కాలర్ బ్రాంచ్ నందు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం సెప్టెంబర్ నెలలో భాగంగా హెల్తీ ఇండియా ను నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ ఏజీఎం కృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణకు శారీరక మానసిక దృఢత్వానికి సరైన పౌష్టికాహారం, సరైన నిద్ర, యోగ, స్వచ్ఛమైన గాలి, తగు మోతాదులో నీరు తప్పక అవసరమని తెలియజేశారు. ప్రిన్సిపల్ మల్లిక బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిరోజు పి ఈ టి ల సహకారంతో జరిగే యోగ, ఫిజికల్ యాక్టివిటీలు, విద్యార్థినులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులకు పండ్లు, గుడ్లు, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని ఏవోలు మూర్తి, శ్రీకాంతులు తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని గుర్తించి ప్లానెట్ ఆప్టిక్స్ వారి సౌజన్యంతో కంటి పరీక్షల క్యాంపు, దంత సంరక్షణ వాటి విలువలు తెలియజేసేందుకు ఉచిత దంత పరీక్ష క్యాంపు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శకుంతల, సౌజన్య ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని పాఠశాల విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు వినియోగించుకున్నారని తెలిపారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ప్రతి నెల ఒక అంశంతో విద్యార్థులతో అవగాహన పెంచడానికి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఏజీఎం కృష్ణ, ఆర్ ఐ శ్రీరామ్ రెడ్డి, హరి, కోఆర్డినేటర్ రవి, ప్రిన్సిపల్ మల్లిక, బాలరాజు, డీన్స్ పవన్ సుభాష్, సతీష్, రేణుక, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *