శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని సాదన్ పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాలేశ్వరం మహాదేవపూర్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో సాధన్ పల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సుమారుగా 121 మంది కంటి పరీక్షలు చేపించుకున్నారు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 40 మంది పేషెంట్లను కంటిలో పొరలు శుక్లములు వచ్చిన వారిగా లయన్స్ క్లబ్ వెంకన్న ఆప్తాలమిక్ గుర్తించి వారికి ఉచితముగా కంటి ఆపరేషన్లు చేపిస్తామని సాధనపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసినారు ఇట్టి కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించినందుకు ప్రజ్వల ఎఫ్ పి సి ఎల్ మరియు లయన్స్ క్లబ్ వారికి సాధనపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి వైద్యశిబిరాలు ముందు ముందు కూడా నిర్వ హించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్ష శిబిరంలో ప్రజ్వల డైరెక్టర్ జంగసమ్మయ్య , ఎఫ్ ఎఫ్ దొడ్డిపాక రవిచందర్ తరాల తిరుపతి ఎఫ్ ఎఫ్ మరియు గ్రామ కారోబార్ కత్తుల రవి పాల్గొన్నారు.