Sithakka Supports Fire Victim Family
అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా వరంగల్ పట్టణ కలకోట వెంకటేశ్వరరావు కుమారుడు, కోడలు ఫని కుమార్, డాక్టర్ శీతల్ వ్యవహరించారు.అలాగే సింగిరికొండ సురేష్ విజయ దంపతుల వివాహ పర్వదిన సందర్భంగా రూ.2 వేలు విరాళంగా అందజేసినట్లు దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.
