హసన్పర్తి (నేటిధాత్రి):
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని దేవన్నపేట లో కార్పోరేటర్ దివ్యరాణి రాజు నాయక్ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే రజక కమ్యూనిటీ హల్ కి భూమి పూజ చేశారు . ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్ పంజాల భూపాల్ గౌడ్, రాజు నాయక్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోలేపల్లి రాజు (మైకల్),చుంచు రవి,విజేందర్, పోలేపల్లి రాజశేఖర్,శ్రీను, ప్రవీణ్, సుమన్,అనిల్,ప్రశాంత్ ,సాంబ రాజ్, రవి,సతీష్, కిరణ్ ,సుదన్, రంజిత్, రాజు పాల్గొన్నారు.